మొక్కలతో మీ రోహిణి...
on Jun 30, 2022
ప్రపంచం మొత్తం కూడా ప్లాస్టిక్ మాయమైపోతుంది. పచ్చని చెట్లు ఎక్కడా కనిపించకుండా పోతున్నాయి. ఐతే కొంతమంది మాత్రం ఇంట్లో మొక్కల్ని పెట్టుకోవడమా, గార్డెన్ లో, లాన్లో మొక్కల్ని పెంచుకోవడమే వంటివి చేస్తారు. అలాంటి కోవలోకి వస్తుంది రౌడీ రోహిణి. తన ఇంటినంతటిని మొక్కలతో అలంకరించేసింది. వాటిని ఆడియన్స్ తో షేర్ చేసుకోవడానికి ఒక వీడియో కూడా చేసింది. గోల్డెన్ టబ్ లో కొన్ని మొక్కల్ని డెకరేట్ చేసి గోడకు తగిలించింది. తన ఇంట్లో పెట్టిన మొక్కలన్నీ కూడా లోలైట్, ఎయిర్ ప్యూరిఫయ్యర్ ప్లాంట్స్ అన్నమాట. వీటికి ప్రతీ రోజు నీళ్లు పోయాల్సిన పని లేదు, టెన్ డేస్ కి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది అని చెప్పింది .
అలాగే ఎండ కూడా అంత అవసరం ఉండదు, ఇవన్నీ నీడ పట్టున పేరైన ఇన్డోర్ ప్లాంట్స్ అని చెప్పింది. అందానికి అందాన్ని ఇవ్వడమే కాదు ఫ్రెష్ ఎయిర్ కూడా అందిస్తాయట ఈ మొక్కలు. రెడ్ ఎగ్లోనిమా, గోల్డెన్ పోతోస్ అని మనీ ప్లాంట్ లో ఒక వెరైటీని, అలాగే పేపరోమియా ప్లాంట్ కూడా డెకరేట్ చేయించుకుంది. ఇక తన బెడ్ పక్కన స్నేక్ ప్లాంట్ అనే ఒక మొక్కను పెట్టించుకుంది. ఈ మొక్క ఆక్సిజన్ ఎక్కువగా సరఫరా చేస్తుందట . అలాగే చైనీస్ ఎవర్ గ్రీన్ అనే మొక్కను వాళ్ళ అక్క రూమ్ లో పెట్టించింది.
రోహిణి వాళ్ళ అమ్మ కోసం తులసి మొక్కను , తన కోసం ఎల్లో రోజ్ ప్లాంట్ ని కూడా తెప్పించుకుంది. ఇక అలాగే తన ఇంట్లో స్పేస్ కి తగ్గట్టు ప్లాంట్ పాట్స్ ని డిజైన్ చేశారు ప్లాన్ ఏ ప్లాంట్ వాళ్ళు అని చెప్పుకొచ్చింది రోహిణి. ఇక మొక్కల్లో ఉన్న మట్టి ఎండిపోతే తప్ప లేకపోతే నీళ్లు పోయాల్సిన అవసరం పడదని చెప్పింది. ఎందుకంటే 20 రకాల మట్టి నమూనాలతో తయారు చేసిన మట్టి కాబట్టి అంత తొందరగా ఎండిపోయే పరిస్థితి రాదని వివరించింది. ఇక ప్లాంట్ డెకొరేషన్ చాలా బాగుంది. మొక్కల్ని ఇంట్లో షోగా పెట్టుకుంటారని తెలుసు కానీ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని ఇప్పుడే తెలిసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..